బెంగళూరు: కర్ణాటకలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు జేడీఎస్సే సరైన ప్రత్యామ్నాయమని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతపోరుతో నేతలు బయటికి వెళ్తున్నారని.. బీజేపీ, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మ్యాజిక్ కర్ణాటకలో పనిచేయదని చెప్పారు.
ఈసారి ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలనే విషయంలో కర్ణాటక ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా బీజేపీ అసలు సమస్యలపై దృష్టిపెట్టడం లేదని ఆరోపించారు. మన చరిత్రను, సంస్కృతిని మార్చడమే బీజేపీ పనిగా పెట్టుకున్నదని విమర్శించారు.