లక్నో: ఇద్దరు జవాన్లు ఒక దివ్యాంగుడిపై తమ ప్రతాపం చూపారు. నీరు అడిగినందుకు అతడ్ని దుర్భాషలాడటంతోపాటు కొట్టారు. ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 26 ఏళ్ల సచిన్ సింగ్, 2016లో ముంబైలో జరిగిన రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. ప్రస్తుతం డియోరియా జిల్లాలోని ఒక రెస్టారెంట్లో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. అలాగే సిమ్ కార్డులు కూడా అమ్ముతూ జీవిస్తున్నాడు.
కాగా, దివ్యాంగుడైన సచిన్ సింగ్ శనివారం రాత్రి మూడు చక్రాల వాహనంపై ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అయితే రోడ్డుపై ఒక తాబేలు కనిపించింది. దానిని తీసి సమీపంలోని గుడి వద్ద ఉన్న చెరువులో విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఇంటికి ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో ఇద్దరు ప్రాంతీయ రక్షక్ దళ్ (పీఆర్డీ) జవాన్లను అతడు చూశాడు. తాబేలు పట్టుకున్న చేతుల నుంచి వాసన రావడంతో ఆ జవాన్లను నీరు అడిగాడు.
మరోవైపు ఆ జవాన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచిన్ను తిట్టడటంతోపాటు కొట్టారు. అతడ్ని జైల్లో పెడతామని బెదిరించారు. ఒక మేడపై ఉన్న వ్యక్తి ఇదంతా చూశాడు. తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ సంఘటన పోలీస్ అధికారుల దృష్టికి వెళ్లింది. దివ్యాంగుడి పట్ల అమానుషంగా ప్రవర్తించిన పీఆర్డీ జవాన్లను రాజేంద్ర మణి, అభిషేక్ సింగ్గా గుర్తించారు. వారిద్దరిని పోలీస్ అనుబంధ విధుల నుంచి తొలగించారు.
In UP's Deoria, a purported video of a specially-abled man on a tricycle being assaulted by two men identified as Prantiya Rakshak Dal (PRD) jawans has surfaced on social media. pic.twitter.com/grJgsp195G
— Piyush Rai (@Benarasiyaa) July 30, 2023