Poonch | జమ్మూ కశ్మీర్లో ఫూంచ్ జిల్లాలోని మండి తహసీల్లోని భారత్ – పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంట ఉన్న సబ్జియాన్ సెక్టార్లో ఇద్దరు చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. సరిహద్దు నియంత్రణ రేఖ ఛపాడియాన్ ప్రాంతంలోని పాక్ ఆక్రమిత ప్రాంతంలోకి ఇద్దరు ఉగ్రవాదుల చొరబాటును భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఈ క్రమంలో ఓ ఉగ్రవాదిని బలగాలు హతమార్చగా.. మరో ఉగ్రవాది తీవ్రంగా గాయపడ్డాడు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరో ఉగ్రవాది కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అలాగే మెంధార్లో అనుమానాస్పదంగా పలువురు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు బలగాలు ఆరుకుపైగా సరిహద్దు గ్రామాల్లో తనిఖీలు నిర్వహించాయి.