Gulam Nabi Azad | జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై ఆ పొరపాటు చేయొద్దని కేంద్ర హోంమంత్రి అమిత్షాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కోరారు. తొలుత అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించి.. తర్వాత రాష్ట్ర హోదా ఇవ్వాలనుకుంటే అది పొరపాటవుతుందని, ఆ పని చేయొద్దని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా.. తొలిసారి కశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆజాద్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ప్రధాని మోదీ తన ఇంటికి కశ్మీరీ నేతలను చర్చలకు ఆహ్వానించినప్పుడు ముందు రాష్ట్ర హోదా కల్పించి తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు గుర్తు చేశారు. ఇతర పార్టీలు కూడా ఇదే డిమాండ్ చేశాయని చెప్పారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించడంతోపాటు అసెంబ్లీ హోదా రద్దుతో తాము చాలా కోల్పోయామన్నారు. 370 అధికరణం రద్దుతో జమ్ముకశ్మీర్ స్వరూపమే మారిపోతుందని చెప్పినా.. ఆచరణలో జరిగిందేమీ లేదని ఆజాద్ అన్నారు.