శ్రీనగర్ : శ్రీనగర్ రంగ్రెత్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందగా.. వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో బలగాలను చూసిన ఓ ఉగ్రవాది సైనికులపైకి కాల్పులు ప్రారంభించాడు. ఆ తర్వాత బలగాలు ఉగ్రవాదికి లొంగిపోయేందుకు అవకాశం ఇచ్చింది.
వినకుండా కాల్పులకు తెగబడడంతో ప్రతిగా.. బలగాలు కాల్పులు జరిపాయి. బలగాల కాల్పుల ధాటికి ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులు ఏ ఉగ్ర సంస్థకు చెందిన వారో ఇంకా గుర్తించలేదని అధికారులు తెలిపారు. 24 గంటల కిందట ఆదివారం పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే సంస్థకు చెందిన ఉగ్రవాదిని బలగాలు హతమార్చాయి. మృతుడి నుంచి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఉగ్రవాదికి లొంగిపోయేందుకు అవకాశం ఇచ్చినా కాల్పులు జరిపాడు. దీంతో బలగాలు కాల్పులు జరుపడంతో మరణించాడు. ఉగ్రవాదిని సమీర్ అహ్మద్ తంత్రేగా గుర్తించారు. బరాగాం నివాసి అని, నవంబర్ 2న ఉగ్రసంస్థలో చేరాడని, అతన్ని ‘సీ’ కేటగిరిలో చేర్చామని పోలీసులు పేర్కొన్నారు. షోపియాన్లో భద్రతా బలగాలు ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను హతమార్చాయి. వారి వద్ద నుంచి ఒక ఏకే 47 రైఫిల్, రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నాయి.