న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి సుమారు 30 లక్షల ఈవీఎంలు అవసరమవుతాయని, సన్నద్ధతకు ఏడాదిన్నర సమయం అవసరమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
జమిలి నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల రోడ్మ్యాప్ను లా కమిషన్ బుధవారం కమిటీకి అందజేసింది.