Jaishankar | డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందం చర్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ (GTS)లో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నామని వెల్లడించారు. గతంలో ట్రంప్ పరిపాలనతో నాలుగు సంవత్సరాలు ఈ విషయంలో చర్చలు జరిపినా.. ఒప్పందం కుదరలేదన్నారు. కానీ, ప్రస్తుతం పూర్తిగా సంసిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నామన్నారు. ఏడాదిలో అమెరికా పరిపాలనలో చాలా మార్పులు వచ్చాయని.. కానీ మరో మార్పు వచ్చిందని.. ఇది ఒక పరిణామన్నారు. ఇదీ చైనా ఎదుగుదల అని.. అక్కడ బిజినెస్ కథ కూడా టెక్నాలజీ కథేనన్నారు.
వాటిలో డీప్ సీక్ ఒకటి. చైనా చేసిన మార్పులు అమెరికా పరిస్థితిలో వచ్చిన మార్పులను పోలి ఉన్నాయన్న ఆయన.. ఒక వ్యక్తిని మరొకరు కొంతవరకు ప్రభావితం చేస్తారని స్పష్టమవుతోందన్నారు. అమెరికా-చైనా సంబంధాలతో తమ అనుభవాలు చాలా భిన్నంగా ఉన్నాయన్నారు. వాస్తవానికి మనం రెండు విపరీతాలను చూశామని.. స్వాతంత్య్రం వచ్చిన తొలి కొన్ని దశాబ్దాల్లో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొని మధ్యలోనే చిక్కుకుపోయామన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితతి లేదని.. ఇది ఒక రకంగా గోల్డిలాక్స్ సమస్య లాంటిదన్నారు. ప్రస్తుతం మనం పోటీ యుగం వైపు పయనిస్తున్నామని ఎస్ జైశంకర్ అన్నారు. వివిధ దేశాలు ఇందు కోసం ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ఈ ప్రణాళిక కూడా చాలా కష్టంగా ఉంటుందన్నారు. ఇప్పుడు ఏదీ పూర్తిగా వ్యాపారం కాదని.. ప్రతిదీ కూడా వ్యక్తిగతమేనన్నారు.