జైపూర్: దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వర్షాల్లో వానలు దంచికొడుతున్నాయి. అయితే రాజస్థాన్లోని ఓ ప్రాంతంలో మాత్రంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎడారి ప్రాంతమైన జైసల్మేర్లో (Jaisalmer) శనివారం రికార్డు స్థాయిలో 43.5 డిగ్రీల సెల్సీయస్ నమోదయింది. సెప్టెంబర్ నెలలో (September) ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం గత 74 ఏండ్లలో ఇదే మొదటిసారి. సాధారణ ఉష్ణోగ్రతలకు ఇది 6.9 డిగ్రీలు అధికం.
జైసల్మేర్లో 1949, సెప్టెంబర్ 10న 43.3 డ్రిగీలు రికార్డయింది. ఇప్పటివరకు ఇదే అత్యధికమని వాతావరణ శాఖ (MeT) వెల్లడించింది. ఎడారిలోని పలు ప్రాంతాల్లో వేడి గాలులు వీచాయని తెలిపారు. ఇక బర్మేర్లో (Barmer) 40.3 డిగ్రీలు, బికనేర్లో 40 డిగ్రీలు, జోధ్పూర్లో 39.5 డిగ్రీలు, జాలోర్లో 38.7 డిగ్రీలు, గంగానగర్లో 38.5 డిగ్రీలు, ఇక జైపూర్లో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న నెలలు కూడా రాష్ట్రంలో ఇదే విధంగా ఉంటాయని చెప్పారు.