గౌహతి : హక్కుల కార్యకర్త, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో సహా 125 మందితో పాటు అఖిల్ గొగోయ్ ప్రమాణ స్వీకారం చేశారు. జైలులో ఉన్న అఖిల్ను ప్రమాణ స్వీకారం నిమిత్తం 126 మంది సభ్యుల సభకు భద్రతా సిబ్బంది తీసుకువచ్చింది. అతను విలేకరులతో మాట్లాడకుండా సెక్యూరిటీ అడ్డుకుంది. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తే తన విధులనెలా నిర్వర్తించగలడని శిబ్సాగర్కు చెందిన ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు.
సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ జైలు నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. అసోం అసెంబ్లీ ఎన్నికల్లోనే సరికొత్త చరిత్ర నమోదు చేశాడు. శిబ్సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రచారంలో పాల్గొనకుండానే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సురభి రాజ్కోన్వారిపై 11,875 ఓట్ల తేడాతో గెలుపొందాడు. సీఏఏ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో దేశద్రోహం, ఇతర అభియోగాల కింద 2019లో గొగోయ్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జైలులోనే ఉన్న అఖిల్కు బెయిల్ రావాల్సిఉంది.