న్యూఢిల్లీ: జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించే వ్యక్తులకు జరిమానా, జైలు శిక్షను పెంచాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. దీనికి సంబంధించి ప్రస్తుత చట్ట సవరణ కోసం ముసాయిదా బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నది. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం 1960 నాటిది. దాని ప్రకారం మొదటిసారి నేరానికి పాల్పడిన వ్యక్తులు కేవలం రూ.50 జరిమానా కట్టి తప్పించుకుంటున్నారు. ముసాయిదా బిల్లును సిద్ధం చేశామని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు.