సుల్తాన్బజార్,జూన్ 26: రాష్ట్రంలోనే మొట్టమొదటి సారి ఉస్మానియా దవాఖానలో స్కిన్ బ్యాంకు ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలో 16వ స్కిన్ బ్యాంకును ఈనెల 28న రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఉస్మానియా దవాఖానలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఏర్పాటయ్యే ఈ స్కిన్ బ్యాంకులో వాల్క్ కోల్డేజ్ స్టోర్ రూం,షేకింగ్ ఇన్క్యూబెటర్, కూలింగ్ ఇన్క్యూబెటర్, సీలర్, డర్మెటామ్ మిషన్, మెషర్, బయోసేఫ్టీ క్యాబినెట్ వంటి తదితర అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేశారు.మృతి చెందిన వారి నుంచి సేకరించిన చర్మాన్ని నిల్వ ఉంచేందుకు ప్రత్యేక బాక్స్ల్లో ఉంచి కోల్డ్ స్టోరేజ్ రూమ్లో భద్రపరుస్తారు. స్కిన్ బ్యాంకు ఏర్పాటుతో 50 శాతానికి పైగా కాలిన గాయాలతో వచ్చిన వారిని 90శాతం రికవరీ చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఉస్మానియా దవాఖానలో స్కిన్ బ్యాంకు ఏర్పాటుకు జీవన్దాన్ ట్రస్టుకు ఐప్లె చేశారు. ట్రస్టు ఈ విషయమై స్పందించి డీఎంఈకి లేఖ ద్వారా ఉస్మానియాలో ఏర్పాటు చేయాలా వద్దా అనే నివేదికను సమర్పించాలని కోరారు.దీంతో డీఎంఈ నిమ్స్ ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ శ్రీకాంత్,డాక్టర్ రాజు అయ్యంగార్,డాక్టర్ సునీల్ కుమార్,డాక్టర్ పద్మజలను నియమించారు.వీరు ఉస్మానియాలో ఏర్పాటయ్యే స్కిన్ బ్యాంకును శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ హెచ్వోడీ డాక్టర్ పలుకూరి లక్ష్మి, డాక్టర్ నాగప్రసాద్ తదితరులు స్కిన్ బ్యాంకు ఏర్పాట్ల గురించి వివరించారు.