పుల్వామా: జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లా రాజ్పొర ఏరియాలో ఉగ్రవాదులు బరితెగించారు. రాజ్పొరాలో విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బంది నుంచి ఆయుధం లాక్కుని పారిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన జమ్ముకశ్మీర్ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆయుధం ఎత్తుకెళ్లిన ఉగ్రవాదుల జాడ కోసం స్థానిక పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా పుల్వామాలో గాలిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఘటన ఎలా జరిగింది అనే విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.