తిరువనంతపురం: కేరళ హైకోర్టులో మరోసారి ఓ పిటీషినర్కు చుక్కెదురైంది. వ్యాక్సిన్ సర్టిఫికేట్పై ప్రధాని మోదీ బొమ్మను తొలగించాలని పీటర్ మలిపరంపిల్ అనే వ్యక్తి కేసు దాఖలు చేశాడు. నిజానికి డిసెంబర్ 21వ తేదీన ఇదే కేసులో సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఆ పిటీషన్ను కొట్టివేస్తూ అతనికి లక్ష రూపాయల జరిమానా విధించారు. అయితే ఇవాళ కూడా ఆ కేసులో ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ.. పిల్ను బెంచ్ కొట్టివేసింది. వ్యాక్సిన్ సర్టిఫికేట్పై ఉన్న ప్రధాని మోదీ ఫోటో అడ్వర్టైజ్మెంట్ కాదు అని, దేశ ప్రజలకు సందేశం ఇచ్చే హక్కు ప్రధానికి ఉందని, అది వ్యాక్సిన్ సర్టిఫికేట్ అయినా తప్పదని కోర్టు పేర్కొన్నది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పునే సీజే ఎస్ మణికుమార్, జస్టిస్ షాజీ పీ చాలేతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. ప్రధాని ఇచ్చిన సందేశం యాడ్ కాదని కూడా బెంచ్ అభిప్రాయపడింది. అయితే తమ తీర్పుకు చెందిన పూర్తి పాఠాన్ని త్వరలో అప్లోడ్ చేయనున్నట్లు ధర్మాసనం తెలిపింది.