శ్రీహరికోట: ప్రైవేటుగా అభివృద్ధి చేసిన విక్రమ్-S రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం దేశానికి, మా స్కైరూట్ ఎరోస్పేస్కు ఓ పెద్ద మైలురాయి అని ఆ సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు పవన్కుమార్ చందన చెప్పారు. స్కైరూట్ ఎరోస్పేస్ సంస్థ రూపొందించిన విక్రమ్-S రాకెట్ను ఇవాళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది.
దీనిపై మాట్లాడిన పవన్కుమార్ చందన.. దేశంలో ప్రైవేట్ సంస్థ రూపొందించిన రాకెట్ను ఇస్రో ప్రయోగించడం ఇది తొలిసారి అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది తాము మరో కొత్త మిషన్కు సిద్ధమవుతున్నామని, అది ఆర్బిటల్ మిషన్ అని ఆయన చెప్పారు.