న్యూఢిల్లీ: తెలియని నంబర్ల నుంచి మీకు ఫోన్లు వస్తున్నాయా? నిత్యం సందేశాలను పంపిస్తున్నారా? మార్కెటింగ్ పేరిట విసిగిస్తున్నారా? అయితే మే 1 నుంచి ఇటువంటివి నిలిచిపోనున్నాయి. మార్కెటింగ్ పేరిట ఫోన్లు చేసి సైబర్నేరాలకు పాల్పడి ఆర్థిక మోసాలు చేస్తున్నవారి ఆటకట్టించేందుకు భారత టెలికం రెగ్యులేటరి అథారిటీ (ట్రాయ్) నడుం బిగించింది.
ఈ మేరకు ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్లను నిలువరించాలని టెలికం కంపెనీలకు ఆదేశాలిచ్చింది. నూతన నిబంధనలను మే 1 నుంచి కచ్చితంగా అమల్లోకి తేవాలని హుకుం జారీ చేసింది. ఏఐ ఫిల్టర్లను ఉపయోగించి సాధారణ, స్పామ్ కాల్స్ను గుర్తించాలని సూచించింది.