న్యూఢిల్లీ, అక్టోబర్ 15: దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయటం బాధాకరంగా ఉన్నదని మహాత్మాగాంధీ మనుమడు రాజ్మోహన్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. నెహ్రూ గొప్ప మనిషి అని, అలాంటి వ్యక్తిని దూషించటం ఏమిటని కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం హిమాచల్ప్రదేశ్లోని కసౌలీలో జరిగిన కుశ్వంత్సింగ్ లిటరసీ ఫెస్టివల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘చాలా బాధపడుతున్నా. ఇలాంటి వ్యాఖ్యల పట్ల హిమాలయాలు నిరసన వ్యక్తం చేస్తాయి. భూమి కూడా నిరసన వ్యక్తం చేస్తుంది’ అని అన్నారు. ఆయనపై వచ్చే తప్పుడు ఆరోపణలను ఖండించాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించారు.