న్యూఢిల్లీ, అక్టోబర్ 10: లఖింపూర్ ఘటనను హిందువులు, సిక్కుల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నదని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ హెచ్చరించారు. ఇది చాలా ప్రమాదకరమన్నారు. మానిన గాయాలను మళ్లీ రేపడమేనన్నారు. 1984 నాటి గాయాలు మానడానికి తరం కాలం పట్టిందన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ నుంచి ఇటీవలే వరుణ్ గాంధీని తొలగించిన సంగతి తెలిసిందే. లఖింపూర్ ఘటనకు మతంతో సంబంధం లేదన్నారు.