న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలు పెదవి విరుస్తున్నాయి. ఇది దిశానిర్దేశం లేని బడ్జెట్ అని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ విమర్శించారు. రైతులకు, మహిళలకు, యువతకు అందించేవి ఏమీ బడ్జెట్లో లేవన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల గురించి కూడా ఈ బడ్జెట్ ఏమీ ప్రకటించలేదన్నారు. పేదలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేదన్నారు.
రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కూడా కేంద్ర బడ్జెట్ను విమర్శించారు. పేదలు, యువత, నిరుద్యోగులు లేదా ద్రవ్యోల్బణం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు. డిజిటల్ కరెన్సీపై ఎలాంటి చట్టం లేనప్పటికీ ఇప్పుడు దానిపై పన్ను వేస్తున్నారని విమర్శించారు.