న్యూఢిల్లీ: చండీగఢ్ ఎయిర్పోర్టు పేరును షాహీద్ భగత్సింగ్ ఎయిర్పోర్టుగా మార్చనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఇవాళ మన్ కీ బాత్ 93వ ఎడిషన్లో దేశ ప్రజలతో ఆలిండియా రేడియోలో మాట్లాడిన ప్రధాని.. మొహాలీ-చండీగఢ్ ఎయిర్పోర్టు పేరును షాహీద్ భగత్సింగ్ ఎయిర్పోర్టుగా మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు.
మొహాలీ-చండీగఢ్ ఎయిర్పోర్టు పేరును షాహీద్ భగత్సింగ్ ఎయిర్పోర్టుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని తామే కోరామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. హర్యానాకు చెందిన పౌరవిమానయాన శాఖ మంత్రి దుశ్యంత్ చౌతాలా, తాను సంయుక్తంగా ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన శాఖకు లేఖ రాశామని మాన్ చెప్పారు.
ఈ నెల 28న భగత్సింగ్ జయంతి ఉన్నదని, ఆలోపే ఎయిర్పోర్టుకు ఆయన పేరు పెట్టాలని లేఖలో కోరినట్లు భగవంత్ మాన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఎయిర్పోర్టుకు భగత్సింగ్ పేరు పెడుతున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉందని పంజాబ్ సీఎం చెప్పారు.