న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆన్లైన్ గేమ్లపై పన్నులు విధించాలని కేంద్ర బడ్జెట్లో నిర్ణయించారు. ఇప్పటివరకు ప్రారంభ పరిమితిగా అమలు చేస్తున్న రూ.10 వేల పన్ను విధానాన్ని తొలగించి నికర విజయాలపై 30 శాతం పన్ను వసూలు చేయనున్నట్టు కేంద్రం బుధవారం బడ్జెట్లో ప్రకటించింది. ఇప్పటివరకు కొనసాగుతున్న విధానాన్ని తొలగించి ఒక ఆర్థిక సంవత్సరం గేమ్లలోఅతను సాధించిన విజయాలపై లభించిన మొత్తంపై పన్ను విధిస్తారు.
ఒకవేళ యూజర్ తన ఖాతాలోని సొమ్మును విత్డ్రా చేయకుండా ఉంటే ఆ ఏడాది ఆఖరులో ఖాతాలోంచే పన్ను సొమ్మును మినహాయిస్తారు. దీనిపై బడ్జెట్ రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ యూజర్ గేమ్స్ ద్వారా పొందిన నికర విజయాల సరాసరి విలువపైనే పన్ను విధింపు ఉంటుందన్నారు. పలు ఆన్లైన్ గేమ్ నిర్వాహకులు యూజర్లు గెలుపొందిన మొత్తాన్ని తక్కువగా ప్రకటిస్తున్నారని, రూ.10 వేల కన్నా తక్కువ గెల్చుకున్నట్టు చూపిస్తూ పన్ను నుంచి తప్పించుకుంటున్నారని, దానిని అడ్డుకోవడానికి ఈ కొత్త పన్ను విధానం దోహదం చేస్తుందని చెప్పారు.