CBSE | న్యూఢిల్లీ, డిసెంబర్ 1: 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ప్రకటన చేసింది. విద్యార్థులకు డివిజన్లు, డిస్టింక్షన్లు ఇవ్వబోమని స్పష్టంచేసింది. ‘డివిజన్, డిస్టింక్షన్, అగ్రిగేట్ మార్క్స్ లాంటివేవీ టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఇవ్వం. విద్యార్థి 5 కంటే ఎక్కువ సబ్జెక్టులు ఎంచుకొంటే ఉత్తమమైన ఐదింటిని మాత్రమే పాఠశాల పరిగణనలోకి తీసుకొంటుంది’ అని సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ శుక్రవారం తెలిపారు.
మార్కుల శాతాలను బోర్డు లెక్కించదని చెప్పారు. అయితే, ఉన్నత విద్య, ఉద్యోగం కోసం విద్యార్థికి వచ్చిన మార్కుల్లో శాతాన్ని లెక్కించాల్సి వస్తే ఆ విద్యార్థి చదివిన పాఠశాల మాత్రమే ఆ పని చేస్తుంది.