ముంబై, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ముంబైలో ఉగ్రవాదులు జరిపిన ఘాతుకానికి ఆదివారంతో 15 ఏండ్లు పూర్తయ్యాయి. 26/11 దాడిగా పేర్కొనే ఆ పీడ కల భారత్కు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఆ దాడిలో పాల్గొన్న టెర్రరిస్టు అజ్మల్ కసబ్కు వ్యతిరేకంగా ధైర్యంగా సాక్ష్యం చెప్పిన దేవికకు మాత్రం ప్రభుత్వం ఇస్తానని హామీ ఇచ్చిన ఉద్యోగం, ఇండ్లు ఈ రోజు వరకు ఇవ్వక తీవ్ర అన్యాయం చేసింది.
2008 నవంబర్ 26న అప్పుడు ఆమెకు 9 సంవత్సరాలు. కసబ్ చేసిన దాడిలో ఆమె కాలిలో బుల్లెట్ దిగింది. కర్రల సాయంతో న్యాయస్థానానికి వచ్చి అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. ఆమె సాక్ష్యం వలన కసబ్కు ఉరిశిక్ష అమలు చేశారు.