న్యూఢిల్లీ, మే 11: కొవిడ్ ప్రభావంతో అనేక కంపెనీలు వర్క్ఫ్రమ్ హోం బాట పట్టాయి. ఇప్పుడు వైరస్ తీవ్రత తగ్గిందని, ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కంపెనీలు కోరుతున్నాయి.
ఇలా ఆఫీస్కు రమ్మనందుకు గత రెండు నెలల్లో కోడింగ్ లెర్నింగ్ స్టార్టప్ కంపెనీ ‘వైట్హ్యాట్ జేఆర్’కు 800 మందికి పైగా ఉద్యోగులు రాజీనామా చేశారని ఐఎన్సీ42 పేర్కొన్నది.