న్యూఢిల్లీ, మార్చి 23: పన్ను ఎగవేశారన్న ఆరోపణలతో ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే గులాబ్సింగ్ యాదవ్తో పాటు మరికొందరి ఇండ్లలో ఐటీ శాఖ శనివారం సోదాలు నిర్వహించింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గులాబ్సింగ్ యాదవ్ మటియాలా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పన్ను ఎగవేశారన్న అభియోగంపై విచారణలో భాగంగా ఢిల్లీలోని ఘుమ్మస్హెడ గ్రామంలోని ఆప్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి.