బెంగళూరు, మార్చి 22: అంతరిక్ష యాత్రల ఖర్చును తగ్గించడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలక ముందడుగు వేసింది. రీయూజబుల్ లాంచ్ వెహికిల్ (ఆర్ఎల్వీ)-ఎల్ఈఎక్స్-02 ద్వారా పునర్వినియోగ వాహన నౌక సాంకేతికతను విజయవంతంగా పరీక్షించినట్టు శుక్రవారం ఇస్రో ప్రకటించిం ది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి శుక్రవారం ఉ దయం 7.10 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించారు. రామాయణంలోని పుష్ప క విమానం పేరుతో ‘పుష్పక్’గా నామకరణం చేసిన ఈ వాహక నౌకను భారత వాయుసేనకు చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు.
పరీక్షలో భాగంగా కృత్రిమంగా అడ్డంకులు సృష్టించినప్పటికీ అ న్నింటినీ సరిచేసుకుంటూ ముందుగా నిర్దేశించిన విధంగా, పూర్తి కచ్చితత్వంతో స్వయంగా ల్యాండ్ అయ్యింది. దీనికి ప్ర త్యేకంగా ఏర్పాటుచేసిన బ్రేక్ పారాచూ ట్, ల్యాండింగ్ గేర్ బ్రేకులు, నోస్ వీల్ స్టీ రింగ్ వ్యవస్థ ద్వారా రన్వేపై దానికదే ఆగిపోయింది. దీనితో రోబోటిక్ ల్యాం డింగ్ సామర్థ్యాన్ని భారత్ నిరూపించుకుంది. పునర్వినియోగ వాహన నౌక సాంకేతికత అభివృద్ధిపై ఇస్రో 15 ఏండ్ల నుంచి పని చేస్తుంది. 2012లో ఇస్రో రూపొందించిన మొదటి వాహన నౌక డిజైన్ను జాతీయ రివ్యూ క మిటీ ఖరారు చేసింది. 2016లో మొదటి రీయూజబుల్ లాంచ్ వెహికిల్ను తయా రు చేసింది.