న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది ఫిబ్రవరి 17న లాంచ్ చేసిన ఇన్శాట్-3డీఎస్ (INSAT-3DS) శాటిలైట్ తొలి చిత్రాలు పంపింది. ఈ చిత్రాల్లో భారత్ ఎంతో అద్భుతంగా కనిపించింది. ఈ అత్యాధునిక ఉపగ్రహంలో అధునాతన ఇమేజర్, సౌండర్ పేలోడ్స్ వంటి పరికరాలున్నాయి. భూమి, భూ వాతావరణానికి సంబంధించిన అంశాలను ఈ పరికరాలు ఎంతో స్పష్టతతో ఫొటోలు తీయడంతోపాటు డేటాను విశ్లేషిస్తాయి.
కాగా, భూమితోపాటు భారత్కు సంబంధించి ఇన్శాట్-3డీఎస్ పంపిన తొలి చిత్రాలను ఇస్రో సోమవారం విడుదల చేసింది. ఈ శాటిలైట్లోని 6 ఛానల్ ఇమేజర్ పరికరాలు భూమి, భూ ఉపరితలం, వాతావరణం చిత్రాలను పలు తరంగదైర్ఘ్యాల్లో తీశాయని తెలిపింది. మేఘాలు, ఏరోసోల్స్, భూమి ఉపరితల ఉష్ణోగ్రత, పర్యావరణ పరిస్థితి, నీటి ఆవిరి వంటి వాతావరణ, భూ ఉపరితలానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు బహుళ ఛానెల్ ఇమేజర్ ఎంతో ఉపకరిస్తుందని ఇస్రో పేర్కొంది. ఇన్శాట్-3డీఎస్ పంపిన తొలి ఫోటోలను ఎక్స్లో షేర్ చేసింది.
INSAT-3DS Mission:
First glimpse of the beauty and complexity of Earth through modern Imager and Sounder payloads onboard INSAT-3DS.This data serves as crucial input for Indian scientists for mereological studies, weather forecasts, and understanding atmospheric dynamics.… pic.twitter.com/XVF1JviKAW
— ISRO (@isro) March 11, 2024