న్యూఢిల్లీ : విక్రమ్, ప్రజ్ఞాన్లను రీయాక్టివ్ చేసేందుకు ఇస్రో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అవి తిరిగి పని చేయకపోతే ఏమవుతాయనే సందేహం అందరిలోనూ కలుగుతున్నాయి. నిద్రాణస్థితి నుంచి మేల్కొనకపోతే అవి చంద్రుడిపై భారత శాశ్వత రాయబారులుగా మిగిలిపోతాయని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. ఇస్రోతో తిరిగి కాంటాక్ట్లోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవ్తేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2019లో చైనా ప్రయోగించిన చాంగె-4 ల్యాండర్, యుటు-2 రోవర్ లూనార్ నైట్ (చంద్రుడిపై రాత్రి) ముగిసిన తర్వాత తిరిగి పనిచేయడం ప్రారంభించాయి. దీంతో ఇస్రో సైతం తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నది. వీటిని పనిచేయగలిగేలా చేస్తే మరికొంత కాలం పరిశోధనలు కొనసాగే అవకాశం ఉంది.