బెంగళూరు, ఫిబ్రవరి 8: వాతావరణ పరిశోధన కోసం ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని ఈ నెల 17న ప్రయోగించనున్నట్టు ఇస్రో గురువారం వెల్లడించింది. జీఎస్ఎల్వీ ఎఫ్14 వ్యోమనౌక ద్వారా దీన్ని నింగిలోకి పంపనున్నట్టు తెలిపింది.
ఈ ప్రయోగం విజయవంతమైతే వాతావరణ పరిశీలన పెరిగి మెరుగైన వాతావరణ సూచనలను ప్రజలకు అందించే అవకాశం ఉంటుందని వివరించింది. ఈ ఉపగ్రహం ద్వారా భూమి, సముద్రాల ఉపరితలాలను పర్యవేక్షించడం ద్వారా విపత్తు హెచ్చరికలను కూడా జారీ చేయవచ్చని చెప్పింది.