హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ని శుక్రవారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సతీశ్ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించిన కౌంట్డౌన్ శుక్రవారం తెల్లవారుజామున 2.48 గంటలకు ప్రారంభమైంది. ఇది 6.30 గంటలపాటు ముగికొనసాగుతుంది. అనంతరం షార్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ-డీ2 నింగిలోకి బయలుదేరనుంది. ఈ ప్రయోగం 15 నిమిషాల్లో పూర్తికానుంది.
ఈ చిన్న రాకెట్లో 156.3 కిలోల బరువున్న ఈవోఎస్-07 ఉపగ్రహంతోపాటు అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, చెన్నై స్పేస్కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ను భూసమీప కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 450 కిలోమీటర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో ఈవోఎస్-07, 880 సెకన్లకు జానుస్-1, 900 సెకన్లకు ఆజాదీశాట్ను క్షక్ష్యలో ప్రవేశపెట్టనుంది.