న్యూఢిల్లీ, మే 5: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో కీలక అడుగు వేయడానికి సమాయత్తమవుతున్నది. ఇప్పటికే చంద్రు డు, మార్స్పైకి స్పేస్ క్రాఫ్ట్లను పంపిన ఇండియా.. శుక్ర గ్రహం(వీనస్) కక్ష్యలోకి కూడా స్పేస్ క్రాఫ్ట్ను పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. మిషన్ వీనస్ ప్రారంభ దశలో ఉన్నదని, 2024 డిసెంబర్లో స్పేస్ క్రాఫ్ట్ను కక్ష్యలో ప్రవేశపెడతామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్నాథ్ వెల్లడించారు.
శుక్ర గ్రహాన్ని ఆవరించి ఉన్న సల్ఫారిక్ ఆమ్ల మేఘాలు, గ్రహం ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన సింథటిక్ అపెర్చర్ రాడార్ను ఉపయోగించనున్నారు. సౌర కుటుంబంలో శుక్రుడే అత్యంత వేడి గ్రహం.