న్యూఢిల్లీ: ఇప్పుడంతా అంతరిక్ష పర్యాటకానిదే హవా. నాసా, స్పేస్ ఎక్స్, అమెజాన్ సహా పలు సంస్థలు రోదసిలోకి ఔత్సాహికులను పంపుతుండగా, ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నది.
2030 నాటికి స్పేస్ టూరిజాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకొంటున్నదని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఇందుకు ఒక్కో పర్యాటకుడి నుంచి ఇస్రో రూ.6 కోట్లు వసూలు చేయనున్నది.