శ్రీహరికోట: పీఎస్ఎల్వీ-సీ58(PSLV-C58) రాకెట్ను ఇవాళ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆ పరీక్ష ద్వారా ఎక్సోపోశాట్ శాటిలైట్ను కక్ష్యలోకి పంపారు. అయితే ఈ ప్రయోగంలో భాగంగా నాలుగవ దశలో రాకెట్ను రెండు సార్లు ఫైర్ చేశారు. శాస్త్రీయ పరిశోధనల కోసం పీఎస్ఎల్వీ రాకెట్ ఫోర్త్ స్టేజ్ను రెండు సార్లు ఫైర్ చేసినట్లు ఇస్రో చెప్పింది. ఇవాళ ఉదయం 9.10 నిమిషాలకు రాకెట్ నింగిలోకి ఎగిరింది. అయితే 21 నిమిషాల తర్వాత ప్రైమరీ శాటిలైట్ ఎక్స్పో శాట్ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. రాకెట్ ప్రయోగంలో కీలకమైన నాలుగవ దశలో రెండు సార్లు రాకెట్ను ఫైర్ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా రాకెట్ ఆల్టిట్యూడ్ను 650 కిలోమీటర్ల నుంచి 350 కిలోమీటర్లకు తీసుకువచ్చారు. ఈ సమయంలోనే పీఎస్ఎల్వీ పరీక్షలో భాగంగా ప్రయోగించిన 10 పేలోడ్స్ను పరీక్షించారు. ఇవాళ జరిగిన పరీక్షలో వాడిన రాకెట్ను పీఎస్ఎల్వీ-డీఎల్ వేరియంట్గా ఇస్రో పేర్కొన్నది. ఆ రాకెట్ సుమారు 260 టన్నుల బరువు ఉన్నది.
నాలుగో స్టేజ్ను 3-యాక్సిస్ ఆర్బిటాల్ ఫ్లాట్ఫామ్గా కూడా పిలుస్తున్నారు. రాకెట్కు ఓ దశలో డబుల్ ఫైరింగ్ను గతంలో కూడా నిర్వహించారు. 2023 ఏప్రిల్లో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ55 మిషన్లోని పోఓఈఎస్-2 పరీక్ష సమయంలోనూ ఈ ప్రక్రియను చేపట్టారు. ఫోర్త్ స్టేజ్ ఆర్బిటాల్ ఫ్లాట్ఫామ్ కు అవసరమయ్యే ఎలక్ట్రికల్ పవర్ కోసం 50 ఏహెచ్ లిథియమ్ ఐయాన్ బ్యాటరీలను వాడారు. నావిగేషన్, గైడెన్స్, కంట్రోల్ అండ్ టెలీకమాండ్స్, ఆర్బిటాల్ ఫ్లాట్ఫామ్ ఆల్టిట్యూడ్ కంట్రోల్ సిస్టమ్స్ను పీఎస్4 ద్వారా కంట్రోల్ చేయనున్నారు.