బెంగళూరు, నవంబర్ 8: రీయూజబుల్ లాంచ్ వెహికిల్-టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ (ఆర్ఎల్వీ-టీడీ)పై పురోగతిని సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక మొదటి రన్వే ల్యాండింగ్ ప్రయోగం చేపట్టేందుకు (ఆర్ఎల్వీ-ఎల్ఈఎక్స్) సిద్ధమవుతున్నది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోగల టెస్ట్ రేంజ్నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నది. ఇందుకోసం వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టు ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ఇస్రో అధికారుల ప్రకారం.. ఆర్ఎల్వీ వింగ్ బాడీని హెలికాప్టర్ ఉపయోగించి 3-5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్తారు.
రన్వే నుంచి 4-5 కిలోమీటర్ల దూరంలో సమాంతర వేగంతో విడిచిపెడతారు. అనంతరం ఆర్ఎల్వీ ైగ్లెడ్ అయ్యి రన్వేవైపు నావిగేట్ అవుతుంది. చిత్రదుర్గ సమీపంలోని డిఫెన్స్ ఎయిర్ఫీల్డ్లో ల్యాండింగ్ గేర్తో సంప్రదాయక స్వయంప్రతిపత్తితో ల్యాండ్ అవుతుంది. ఇస్రో తన తొలి ఆర్ఎల్వీ-టీడీ హెచ్ఈఎక్స్-01 (హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్పరిమెంట్-01) మిషన్ను 2016 మే 23న షార్లోని సతీశ్ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పరీక్షించింది. రీఎంట్రీ వాహనాల రూపకల్పన, విమాన పరీక్షల కోసం క్లిష్టమైన సాంకేతికతలను విజయవంతంగా ప్రదర్శించింది. ఇది సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్. సముద్రం మీద ల్యాండ్ అయ్యేలా డిజైన్ చేశారు.