శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త చరిత్ర లిఖించింది. అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన ఉపగ్రహ వాహక నౌక ఎల్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్ను ప్రయోగించింది. శ్రీహరికోటలోని షార్ మొదటి లాంచ్పాడ్ నుంచి ఎల్ఎల్ఎల్వీ-డీ1 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేళ చేపట్టిన ఈ రాకెట్ ప్రయోగంతో ఆజాదీశాట్తోపాటు ఈఓఎస్-02 ఉపగ్రహాలను తక్కువ ఎత్తులోని సమీప భూకక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇవి మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ అనుసంధానికి ఉపయుక్తం కానున్నాయి.
#WATCH ISRO launches SSLV-D1 carrying an Earth Observation Satellite & a student-made satellite-AzaadiSAT from Satish Dhawan Space Centre, Sriharikota
(Source: ISRO) pic.twitter.com/A0Yg7LuJvs
— ANI (@ANI) August 7, 2022
కాగా, ఇస్రో ఇప్పటివరకు పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ వాహకనౌకలను మాత్రమే అంతరిక్ష పరిశోధనలకు వినియోగించింది. తాజా అతితక్కువ ఖర్చుతో ఎస్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్ను రూపొందించింది.