శ్రీహరికోటలోని సతీశ్ధావన్ అంతరిక్ష కేంద్రంనుంచి పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్ గురువారం నింగిలోకి దూసుకెళ్లింది. కౌంట్డౌన్ ముగియగానే ఇస్రో ఈ రాకెట్ను రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి ప్రయోగించింది. పీఎస్ఎల్వీ- సీ53 సింగపూర్కు చెంది మూడు ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టనున్నది. పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 55వ ప్రయోగం.
పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్.. సింగపూర్కు చెందిన 365 కిలోల డీఎస్-ఈఓ ఉపగ్రహం, 155 కిలోల న్యూసార్, 2.8 కిలోల స్కూబ్-1 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నది. పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను కమర్షియల్గా ప్రయోగించడంలో ఇస్రో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న విషయం తెలిసిందే. 2016లో పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి చరిత్ర సృష్టించింది. తక్కువ వాణిజ్య ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే సౌలభ్యం కారణంగా చాలా దేశాలు భారత్ నుంచి ప్రయోగించేందుకు మొగ్గు చూపుతున్నాయి.