తిరుపతి: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 (LVM-3) రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. యూకే కంపెనీ వన్వెబ్కు చెందిన 36 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ల్యాంచ్పాడ్ నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు ఎల్వీఎం-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. 20 నిమిషాలపాటు ప్రయాణించి భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది.
LVM3-M3🚀/OneWeb 🛰 India-2 mission
is accomplished!All 36 OneWeb Gen-1 satellites injected into the intended orbits
In its 6th consecutive successful flight, LVM3 carried 5805 kg of payload to Low Earth Orbit@OneWeb @NSIL_India
— ISRO (@isro) March 26, 2023
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శాస్త్రవేత్తలను అభినందించారు. మార్క్-3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేశామన్నారు. వాణిజ్య ప్రయోగాలకు ఇస్రో ముందంజలో ఉందని చెప్పారు. జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
CONGRATULATIONS @isro!!#ISRO launches LVM3-M3/Oneweb India-2 Mission from Satish Dhawan Space Centre (SDSC) SHAR, #Sriharikota.#LVM3M3/#Oneweb pic.twitter.com/zz8BLRtqnP
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) March 26, 2023