న్యూఢిల్లీ (నమస్తే తెలంగాణ) : ఇస్రో ఈ ఏడాది చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమవుతున్న తరుణంలో జపాన్తో కలిసి తలపెట్టిన మరో మూన్ మిషన్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ పనులు ఊపందుకున్నాయి.
చంద్రునిపై నీటి జాడలు, శాశ్వతంగా నీడ, చీకటి ఉన్న ప్రదేశాలను అన్వేషించటానికి ఇండియా, జపాన్లు సంయుక్తంగా లూపెక్స్ మిషన్ను చేపట్టాయి. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ (జాక్సా) తరఫున ఒక బృందం భారతదేశంలో పనిచేస్తున్నది.