అహ్మదాబాద్: సమాచారాన్ని హ్యాకర్ల బారిన పడకుండా సురక్షితంగా పంపించడంలో ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. 300 మీటర్ల దూరంలోని రెండు ప్రాంతాల మధ్య ఈ డేటాను పంపించారు. ఉపగ్రహ ఆధారిత క్వాంటమ్ కమ్యూనికేషన్ సాయంతో అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్, ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. దేశ భద్రత, ఇతరత్రా విలువైన సమాచారాన్ని హ్యాకర్లబారిన పడకుండా పంపించేందుకు క్వాంటమ్ కమ్యూనికేషన్ను అభివృద్ధి చెందిన దేశాలు వినియోగిస్తున్నాయి. హైలెవల్ కోడ్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ రూపంలో ఈ డాటాను పంపిస్తారు. ఈ సమాచారాన్ని బయటి వ్యక్తులు హ్యాకింగ్ చేయలేరు. శక్తిమంతమైన కోడింగ్ను ఉపయోగించి ఒకవేళ దుండగులు హ్యాకింగ్కి పాల్పడినట్లయితే.. బేసిక్ డాటా మరో కోడ్లోనికి ఆటోమేటిక్గా మారుతుంది. అలాగే, హ్యాకింగ్కి సంబంధించిన విషయాన్ని సెండర్కి (డాటాను పంపేవారికి) తెలియజేసి అప్రమత్తం చేస్తుంది. పరిస్థితులు చేయిదాటిపోతే.. చివరకు హ్యాకర్లకు డాటా అందకుండా దాన్ని నిర్వీర్యం చేస్తుంది.