శ్రీహరికోట, ఆగస్టు 8: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్తగా అభివృద్ధి చేసి తొలిసారిగా ప్రయోగించిన చిన్న ఉపగ్రహ నౌక (ఎస్ఎస్ఎల్వీ) ప్రయోగం విఫలమైంది. ఈవోఎస్-02, ఆజాదీశాట్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడంలో ఈ మిషన్ అనుకున్న ఫలితాలు ఇవ్వలేదని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. వాహకనౌక నుంచి ఉపగ్రహాలు విడిపోయినా వాటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టే దశలో అవాంతరాలు తలెత్తాయని, దీంతో ప్రయోగం విఫలమైందని చెప్పా రు. వృత్తాకార కక్ష్యలోకి బదులుగా వలయాకార కక్ష్యలోకి ఉపగ్రహాలు చేరాయన్నారు. అయినా వాహకనౌక పనితీరు అంచనాలు అందుకున్నట్టు వివరించారు.