న్యూఢిల్లీ, మార్చి 24: చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవంపై తొలి అడుగు మోపిన ప్రదేశాన్ని ఇకపై ప్రపంచ దేశాలన్నీ ‘శివశక్తి’ పాయింట్గానే పిలువనున్నాయి. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ (ఐఏయూ) ఆమోదంతో ఈ పేరుకు ప్రధాని మోదీ ప్రకటించిన 7 నెలల తర్వాత ఆమోదంలభించింది.
చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్కు అధికారికంగా ‘శివశక్తి’ పాయింట్ అని పేరు పెట్టేందుకు పారిస్లోని ఐఏయూ ఈ నెల 19న ఆమోదం తెలిపినట్టు ప్లానెటరీ నామిన్క్లేచర్ గెజిట్ వెల్లడించింది.