చండీగఢ్: ‘నా కాలేయం ఇనుముతో తయారైందా?’ అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ప్రశ్నించారు. తనను తాగుబోతు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు. తనపై వచ్చిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. 12 ఏళ్లుగా పగలు, రాత్రి తాను మద్యం సేవిస్తానంటూ వచ్చిన ఆరోపణలను ఒక టీవీ చర్చా కార్యక్రమంలో ఖండించారు. ‘12 ఏళ్లుగా రాత్రి పగలనక మద్యం సేవిస్తే ఎవరైనా బతుకుతారా?. నా లివర్ ఐరన్తో తయారైందా?’ అని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ తాగి ఉంటానని ప్రతిపక్షాలు అంటున్నాయని, అయితే తనపై వేలెత్తి చూపడానికి వారికి ఇంకేమీ లేవా అని మండిపడ్డారు. తాను ఉదయం 6 గంటలకు నిద్ర లేచిన తర్వాత మొదటగా ఫైల్ కోసమే అడుగుతానని చెప్పారు. అందుకే గత 70 ఏళ్లలో జరుగని పనులను ఏడాదిన్నరలో పూర్తి చేసినట్లు వెల్లడించారు.
కాగా, 2019 జనవరిలో జరిగిన బహిరంగ సభలో తన తల్లి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో మద్యపానం మానేస్తానని భగవంత్ మాన్ బహిరంగంగా ప్రమాణం చేశారు. అయినప్పటికీ తాగుబోతన్న విమర్శ వెంటాడుతూనే ఉంది. గత ఏడాది జర్మనీ పర్యటన సందర్భంగా భగవంత్ మాన్ బాగా తాగి నడవలేని స్థితిలో ఉండటంతో విమానం నుంచి దించేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. అందుకే నాడు ఆ విమానం ఆలస్యమైందని విపక్ష నేతలు విమర్శించారు. అలాగే భగవంత్ మాన్ ఎంపీగా ఉన్నప్పుడు మద్యం సేవించి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారని, పూజలు, అంత్యక్రియలప్పుడు కూడా ఆయన మద్యం మత్తులో ఉంటారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను భగవంత్ మాన్ తోసిపుచ్చారు.
मेरा Liver क्या लोहे का है जो 10–12 साल से सुबह शाम पी रहा हूं, फिर भी जिंदा हूं?
जितना काम 75 साल में नहीं हुआ, पिछले सवा साल में किया है
88% घरों में मुफ़्त बिजली जाती है Punjab में! इतना कोयला कभी नहीं था जितना आज है।
नीयत होनी चाहिए काम करने की।
—CM @BhagwantMann… pic.twitter.com/u9YcIxgHk4
— AAP (@AamAadmiParty) June 18, 2023