న్యూఢిల్లీ: తమిళనాడులో ఇవాళ ఆర్మీ హెలికాప్టర్ కూలింది. ఆ విమానంలో త్రివిధదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ఉన్నట్లు తెలుస్తోంది. రావత్ తన ఫ్యామిలీతో ఎంఐ సిరీస్ హెలికాప్టర్లో వెళ్తున్నట్లు తెలిసింది. నీలగిరి అడవుల్లో కూనురు వద్ద హెలికాప్టర్ కూలినట్లు గుర్తించారు. రెస్క్యూ సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లింది. సీనియర్ రక్షణశాఖ అధికారులతో హెలికాప్టర్ వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదంలో ఆర్మీ హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయింది. ఆ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందినట్లు ప్రకటించారు. కానీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రావత్ ఉన్నారా లేదా అన్న విషయం స్పష్టంగా తెలియదు.