Swiggy | న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థగా ఉన్న స్విగ్గీ.. ఇకపై తన సేవలను రైలు ప్రయాణికులకు కూడా విస్తరించనున్నది. ఐఆర్సీటీసీ ఈ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ప్రయాణికులకు ప్రీ-ఆర్డర్డ్ మీల్స్ను(ముందస్తుగా ఆర్డర్ చేసిన ఆహారం) అందించనున్నది.
ఈ మేరకు భారత రైల్వేతో స్విగ్గీ జట్టు కడుతున్నది. స్విగ్గీ ఫుడ్స్తో కలిసి ఈ-క్యాటరింగ్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నట్టు ఐఆర్సీటీసీ తాజాగా స్టాక్ ఎక్సేంజ్ వద్ద ఫైలింగ్లో పేర్కొన్నది. రైలు ప్రయాణికులకు స్విగ్గీ ద్వారా ఫుడ్ డెలివరీ సేవలు మొదట దశలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, భువనేశ్వర్ రైల్వేస్టేషన్లలో అందుబాటులో ఉంటాయని ఐఆర్సీటీసీ ఓ ప్రకటనలో పేర్కొన్నది.