న్యూఢిల్లీ, ఆగస్టు 26: ప్యాసెంజర్లు, సరుకు రవాణాదారుల డాటాను మానిటైజ్ చేసేందుకు కన్సల్టెంట్లను నియమించుకోవాలనుకొన్న వివాదాస్పద నిర్ణయంపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వెనక్కు తగ్గింది. దీనికి సంబంధించి ఇచ్చిన ఈ-టెండర్ను ఉపసంహరించుకున్నట్టు అధికారులు శుక్రవారం పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కూడా ఐఆర్సీటీసీ తెలియజేసింది. డిజిటల్ డాటా మానిటైజేషన్కు కన్సల్టెంట్ల నియామకం కోసం టెండర్లను ఆహ్వానించిన నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెల్ ఐఆర్సీటీసీ అధికారులకు సమన్లు ఇచ్చింది.
డాటా ప్రొటెక్షన్ బిల్లు ఇంకా ఆమోదం పొందని నేపథ్యంలో టెండర్ను వెనక్కు తీసుకుంటున్నట్టు ఐఆర్సీటీసీ ఎండీ, చైర్పర్సన్ రజిని హసిజా ప్యానెల్కు తెలిపారు. కాగా, ప్రయాణికుల డాటాతో వ్యాపారం చేయాలనుకున్న ఐఆర్సీటీసీ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. పౌరుల వ్యక్తిగత గోప్యతపై ఇది ప్రభావం చూపుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి.