పుణె: మహారాష్ట్రలోని పుణెలో ఐపీఎల్ బెట్టింగ్ (IPL Betting) ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.27 లక్షలు, ఎనిమిది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు సభ్యుల ముఠాలో మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. పుణెలోని ఎంసీఏ స్టేడియంలో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ముఠా సభ్యులు ఇరు జట్లపై బెట్టింగ్ నిర్వహించారని తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నామనే సమాచారంతో పుణెలోని కాలేవాడి ప్రాంతంలో దాడులు నిర్వహించామని డిప్యూటీ కమిషనర్ మన్చక్ ఇప్పర్ వెల్లడించారు. బెట్టింగ్కు పాల్పడుతున్న ముగ్గురిని రెడ్హాండెడ్గా పట్టుకున్నామని, మరొకరు తప్పించుకున్నారని తెలిపారు. వారిపై 353, 34 సెక్షన్ల కింద కేసులు నమోదుచేశామన్నారు.