పుణె: కేంద్ర ప్రభుత్వ తీరుపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు శరద్పవార్ ( Sharad Pawar ) మరోసారి విమర్శలు గుప్పించారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు దేశంలోని దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇన్కమ్ ట్యాక్స్ (ఐటీ), నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా కాకుండా పూర్తిగా కేంద్రం కనుసన్నల్లో నడుస్తున్నాయని పవార్ మండిపడ్డారు.
బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలను అస్థిరపర్చడమే లక్ష్యంగా కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నదని పవార్ ఆరోపించారు. అయితే, కేంద్రం ఎన్ని ఎత్తులు వేసినా మహారాష్ట్ర సర్కారును మాత్రం ఏమీ చేయలేదన్నారు. మహారాష్ట్రలో తమ సంకీర్ణ సర్కారు ఐదేండ్లపాటు అధికారంలో ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తుందని శరద్ పవార్ ధీమా వ్యక్తంచేశారు.