బీజింగ్, జూలై 5: కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై రెండేండ్లుగా నిషేధం విధించిన చైనా సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నది. భారత్కు విమాన సర్వీసులను నడపడంపై స్పష్టత లేదు.
గత నెలలో భారత నిపుణులు, వారి కుటుంబసభ్యులపై వీసా బ్యాన్ను చైనా ఎత్తివేసింది. భారతీయ విద్యార్థులను అనుమతించడంపైనా యోచిస్తున్నది. వేలాది మంది చైనా విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నారు.