రాష్ర్టాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు, వంద మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం రూ.75 వేల కోట్లు కేటాయించడంతో మూలధన వ్యయం మొత్తం రూ.10 లక్షల కోట్లకు పెరిగింది. అమృత కాలానికి అనువైన మౌలిక సదుపాయాల వర్గీకరణ, ఫైనాన్సింగ్ ఫ్రేమ్వర్క్ చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
గతేడాది అక్టోబర్ 13న ప్రధాని మోదీ గతిశక్తి పథకాన్ని ప్రారంభించారు. 5 వందల కోట్లు పెట్టుబడి పెట్టడంతోపాటు సమీకృత మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రధానమంత్రి ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ పథకం కింద 3.5 లక్షల గిరిజనులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.