Today History: దేశీయంగా తయారైన తొలి జలంతర్గామి ఐఎన్ఎస్ షాల్కీ.. 1992 లో సరిగ్గా ఇదే రోజున భారత నౌకాదళంలోకి చేరింది. రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు మన దేశం ఎన్నో ఏండ్లుగా ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ జలాంతర్గామిని నిర్మించారు. దీని రాకతో భారతదేశం రక్షణ రంగం స్వావలంబన దిశగా అడుగులు వేసిందని చెప్పవచ్చు.
ఐఎన్ఎస్ షాల్కీ (ఎస్46) అనేది శిశుమార్ క్లాస్ (టైప్ 1500) డీజిల్-ఎలక్ట్రిక్ సబ్మెరైన్. దేశీయంగా నిర్మించతలపెట్టిన ఈ మొట్టమొదటి జలాంతర్గామి నిర్మాణ పనులను 1989 సెప్టెంబర్ 30 న బొంబాయిలో ప్రారంభించారు. దీని నిర్మాణ పనులను మజాగాన్ డాక్ లిమిటెడ్ చేపట్టింది. నౌకాదళంలో శిశుమార్ తరగతికి చెందిన నాలుగు జలాంతర్గాములు ఉన్నాయి. అవి శిశుమార్, శంకుష్, షాల్కీ, శంకుల్. ఈ నాలుగూ 1986-1994 మధ్య భారత నావికాదళంలోకి ప్రవేశించాయి. ఐఎన్ఎస్ షాల్కీ సబ్మెరైన్ను పొడవు 211 అడుగులు, వెడల్పు 21 అడుగులు, 20 అడుగుల లోతుతో నిర్మించారు. ఈ జలంతర్గామి సముద్రంలో 850 అడుగుల లోతు వరకు పరీక్షించగలదు. దీనిలో 8 మంది అధికారులతో పాటు 40 మంది విధులు నిర్వహించేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీని ఉపరితల బరువు 1660 టన్నులు కాగా, నీటి అడుగున 1850 టన్నుల బరువు కలిగి ఉంటుంది. నీటి ఉపరితలంపై గంటకు 22 కిలో నాట్స్ వేగంతో ప్రయాణించగలగడం దీని ప్రత్యేకత.
2001 : ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఎహుద్ బరాక్ ఓటమి, కొత్త ప్రధానిగా ఏరియల్ షారోన్ ఎంపిక
2000 : భారతదేశం-అమెరికా మధ్య ఏర్పడిన జాయింట్ యాంటీ టెర్రరిజం గ్రూప్ తొలి భేటీ వాషింగ్టన్లో ప్రారంభం 1983 : కోల్కతాలో తూర్పు వార్తా సంస్థ స్థాపన 1962: జర్మన్ బొగ్గు గనిలో పేలుడు సంభవించి 298 మంది కార్మికులు దుర్మరణం
1959 : క్యూబాలో కొత్త రాజ్యాంగాన్ని ప్రకటించిన ఫిడెల్ క్యాస్ట్రో
1940 : బ్రిటన్లో రైల్వేలను జాతీయం చేసిన అక్కడి ప్రభుత్వం 1915 : తొలిసారి కదులుతున్న రైలు నుంచి పంపిన వైర్లెస్ సందేశాన్ని అందుకున్న రైల్వే స్టేషన్ అధికారులు
1848 : బ్రిటిష్ మ్యూజియంలో తాగుబోతు కారణంగా ముక్కలైన రెండు వేల ఏండ్ల నాటి పూల కుండి