దేశీయంగా తయారుచేసిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ఎస్ మోర్ముగావ్ను ఆదివారం భారత నౌకా దళంలో ప్రవేశపెట్టారు. ముంబైలో జరిగిన ఈ వేడుకకు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్, గోవా సీఎం ప్రమోద్ సవాంత్ హాజరయ్యారు. ఈ యుద్ధనౌక చేరికతో భారత నేవీ మరింత బలోపేతం అవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ చెప్పారు. ఐఎన్ఎస్ మోర్ముగావ్ అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన యుద్ధ నౌకగా అభివర్ణించారు. ‘ప్రపంచంలో అధునాతన సాంకేతికత కలిగిన యుద్ధనౌకల్లో ఇది ఒకటి. ఇందులోని వ్యవస్థలు భవిష్యత్తు అవసరాలు తీర్చగలవు. మన స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి ఇది నిదర్శనం. ఇతర దేశాలకూ మనం నౌకా నిర్మాణాలు చేసిపెడతాం’ అని పేర్కొన్నారు. గోవాలో చారిత్రక ఓడరేవు నగరమైన మోర్ముగావ్ పేరిట దీనికి ఈ పేరు పెట్టారు.